News April 16, 2025

వనపర్తి: భూభారతిపై షెడ్యూల్ విడుదల

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ నెల 17వ తారీకు నుంచి 26 వరకు మండల కేంద్రాల్లో ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా యంత్రాంగం షెడ్యూల్ విడుదల చేసింది. రైతులు తమ భూములను రిజిస్ట్రేషన్, ఆర్ఓఆర్ సవరణలు, అడంగల్ తప్పొప్పుల సవరణ, నాలా తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

Similar News

News April 16, 2025

విశాఖ: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

విశాఖలో ఇంటర్ విద్యార్థి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన వేదాంత కార్తికేయ మారికవలస ఓజోన్ వ్యాలీలోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరాడు. బుధవారం ఉదయం హస్టల్ గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహాన్ని విశాఖలోని ఓ ఆస్పత్రికి తరలించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లా గరివిడి అని కాలేజీ సిబ్బంది తెలిపారు.

News April 16, 2025

చివరి ఆయకట్టు వరకు నీరు సరఫరా చేయాలి: కలెక్టర్

image

కోనసీమ జిల్లాలో చిట్ట చివరి ఆయకట్టు వరకు పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేసేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జలవనరులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. రబీ సీజన్ పంట సాగుకు రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందించాలని ఆయన అధికారులకు సూచనలు చేశారు.

News April 16, 2025

బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర: మమత

image

బెంగాల్‌ను భ్రష్టు పట్టించేందుకు కేంద్రం మీడియాను వాడుతోందని CM మమతా బెనర్జీ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలను మోదీ పోషిస్తున్నారని విమర్శించారు. UP, కర్ణాటక, బిహార్‌, రాజస్థాన్‌కు చెందిన వీడియోలతో బెంగాల్‌ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. యువతకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి?, పెరిగిన పెట్రోల్, డీజిల్, మెడిసిన్స్ ధరల గురించి మాట్లాడాలంటూ సవాల్ చేశారు.

error: Content is protected !!