News April 16, 2025
భూ భారతి పైలట్ ప్రాజెక్టుగా మద్దూరు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలులోకి తెచ్చిన భూ భారతి మొదటగా పైలట్ ప్రాజెక్టుగా మన నారాయణపేట జిల్లా మద్దూరు మండలాన్ని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మద్దూరు మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో కలిపి మొత్తం 30,621 ఎకరాల పొలం ఉండగా.. అందులో 30,473 ఎకరాలు వ్యవసాయ ఆమోదయోగ్యమైన భూములు ఉన్నాయి. మండలంలో ఈనెల 17 నుంచి నెలాఖరు వరకు అధికారులు గ్రామసభలు నిర్వహించనున్నారు.
Similar News
News April 16, 2025
బెంగాల్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర: మమత

బెంగాల్ను భ్రష్టు పట్టించేందుకు కేంద్రం మీడియాను వాడుతోందని CM మమతా బెనర్జీ ఆరోపించారు. కొన్ని మీడియా సంస్థలను మోదీ పోషిస్తున్నారని విమర్శించారు. UP, కర్ణాటక, బిహార్, రాజస్థాన్కు చెందిన వీడియోలతో బెంగాల్ను అప్రతిష్ఠపాలు చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. యువతకు ఎన్ని ఉద్యోగాలొచ్చాయి?, పెరిగిన పెట్రోల్, డీజిల్, మెడిసిన్స్ ధరల గురించి మాట్లాడాలంటూ సవాల్ చేశారు.
News April 16, 2025
ఇన్స్టా ఫాలోయింగ్పై పూజా హేగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్స్

సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్ల సంఖ్య బాక్సాఫీసును డిసైడ్ చేయలేదని హీరోయిన్ పూజా హెగ్డే అన్నారు. ‘నాకు ఇన్స్టాగ్రామ్లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండొచ్చు. కానీ వారందరూ థియేటర్లకు వస్తారని కాదు. చాలా మంది సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాకు, వాస్తవానికి చాలా తేడా ఉందని అర్థం చేసుకోండి’ అని ఆమె తెలిపారు.
News April 16, 2025
MHBD: చిన్నారిపై కత్తితో కాల్చి వాతపెట్టిన అంగన్వాడి ఆయా

మహబూబాబాద్ పట్టణం సిగ్నల్ కాలనీలోని అంగన్ వాడీ కేంద్రంలో విద్యనభ్యసిస్తున్న మణిదీప్(5)పై అంగన్వాడి ఆయా కత్తితో కాల్చి వాత పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయా దాష్టికంపై సీడీపీవోకు చిన్నారి తల్లితండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఘటన జరిగి 4 రోజులు అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అంగన్వాడీ సెంటర్ ముందు బాధితుడి బంధుమిత్రులు ఆందోళనకు దిగారు.