News April 16, 2025

SUPER.. గిన్నిస్ రికార్డు కొట్టిన నాగర్‌కర్నూల్ వాసి 

image

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ పరిధి కంటోనిపల్లి గ్రామానికి చెందిన అయినాల డేనియల్ రాజ్‌కు వరల్డ్ గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది. 2024 డిసెంబర్ 1న 1,046 మంది ఆన్‌లైన్‌లో ఒకేసారి గంట సేపు కీబోర్డు ప్లే ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. గిన్సిస్ బుక్ నిర్వాహకులు హైదరాబాద్‌లోని మణికొండలో మంగళవారం రాజుకు రికార్డు పత్రాన్ని ప్రదానం చేశారు. 

Similar News

News July 4, 2025

ఖమ్మం: చిన్నారి నృత్యం.. గిన్నిస్ బుక్ రికార్డులో చోటు.!

image

వేంసూరు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన రమేష్ రెడ్డి-మంజీర దంపతుల పదేళ్ల కూతురు చూర్ణిక కూచిపూడి నృత్య ప్రదర్శనలో ప్రతిభ చాటింది. HYDలో జరిగిన పోటీలో 4,219 మంది నృత్యకారులతో కలిసి చూర్ణిక పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సాధించింది. ప్రతిభ చాటిన ఆమెకు నిర్వాహకులు శ్రీ లలిత, వసుంధర గోవిందరాజ్, శ్వేత సర్టిఫికెట్ అందజేశారు. చిన్నారికి మండల వాసులు అభినందనలు తెలుపుతున్నారు.

News July 4, 2025

NGKL: సీఎం రేవంత్ రెడ్డి జూరాలను సందర్శించాలి: జాన్ వెస్లీ

image

జూరాల ప్రాజెక్టు గేట్లు దెబ్బతిన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి జూరాల ప్రాజెక్టును సందర్శించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. జూరాల ప్రాజెక్టును స్థానిక సీపీఎం నాయకులతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు గేట్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని కోరారు.

News July 4, 2025

నటి రన్యా రావుకు చెందిన రూ.34 కోట్ల ఆస్తులు అటాచ్

image

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావుకు సంబంధించిన రూ.34 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రన్యా రావును బంగారం అక్రమ రవాణా, హవాలా నగదు బదిలీల కేసులో DRI అధికారులు ఈ ఏడాది మార్చి 5న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో బంగారం కొని భారత్‌కు తరలిస్తుండగా బెంగళూరులో అధికారులు పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు.