News April 16, 2025

నిర్మల్: ఈ వాహనమే ప్రాణం తీసింది

image

దిలావర్పూర్ మండల సిర్గాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన రాజు (45)అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కొడుకు కేదారనాథ్ అస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. మొదట్లో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టినట్లు కేసు నమోదుచేసిన పోలీసులు తర్వాత సీసీపుటేజీలను పరిశీలించి వాహనాన్ని గుర్తించారు.

Similar News

News April 16, 2025

రూ. 4687 కోట్లతో అమరావతి సచివాలయ నిర్మాణం

image

AP రాజధాని అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణానికి CRDA టెండర్లను ఆహ్వానించింది. 1,2 టవర్ల నిర్మాణానికి రూ.1,897కోట్లు, 3, 4 టవర్ల నిర్మాణానికి రూ.1,664 కోట్లతో టెండర్లను పిలిచింది. వీటితో పాటు HOD ఆఫీసుకు రూ.1,126 కోట్లతో అదనంగా మరో టవర్ నిర్మాణానికీ టెండర్లను పిలిచింది. అటు అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి ఇప్పటికే టెండర్లను ప్రభుత్వం ఖరారు చేసింది.

News April 16, 2025

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించలేం: సుప్రీం

image

వక్ఫ్ సవరణ చట్టంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదంపై దాఖలైన పలు పిటిషన్లపై రేపు మధ్యాహ్నం 2 గంటలకు మధ్యంతర తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అటు వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్ర ప్రభుత్వానికి SC నోటీసులు జారీ చేసింది. కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలతో పాటు పలు ప్రశ్నలకు 2 వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది.

News April 16, 2025

రణస్థలం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

డెంకాడ (M) చొల్లంగిపేట జంక్షన్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రణస్థలం (M) NGRపురానికి చెందిన జగిలి రామప్పడు(54) మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. రామప్పడు తన భార్య మహాలక్ష్మితో కలిసి బైక్‌పై గజపతినగరం(M) గంగచోల్లపెంట గ్రామానికి వెళ్తున్నారు. చొల్లంగిపేట జంక్షన్‌‌కి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో రామప్పడు అక్కడికక్కడే మృతి చెందారు.

error: Content is protected !!