News April 16, 2025

17న అరకులోయలో మెగా జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో అరకులోయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు DSDO డా.రోహిణి తెలిపారు. జాబ్ మేళాలో 10 కంపెనీలు 800పై చిలుకు ఖాళీలను భర్తీ చేయనున్నారు. పాడేరు డివిజన్ పరిధిలోని 10th ఆపై చదువులు, GNM, ANM చదివిన 18 ఏళ్లు పైబడిన వారు ఈ అవకాశం వినియోగించుకోవాలని DSDO కోరారు. ఆసక్తి గల వారు https://www.naipunyam.ap.gov.in/user-registrationలో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News November 4, 2025

చిన్నారి వైష్ణవి హత్యకేసులో హైకోర్టు కీలక తీర్పు

image

AP: 2010 జనవరి 30న VJAలో అపహరణ, హత్యకు గురైన చిన్నారి వైష్ణవి కేసులో శిక్ష రద్దు చేయాలన్న నిందితుల పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీశ్‌కు ట్రైల్ కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు వెంకట్రావును నిర్దోషిగా ప్రకటించి, శిక్ష రద్దు చేసింది. వైష్ణవిని కిడ్నాప్ చేసి హత్య చేశారు. తర్వాత GNT శారదా ఇండస్ట్రీస్‌లోని బాయిలర్‌లో వేసి బూడిద చేశారు.

News November 4, 2025

కొండ చుట్టూ గ్రామాలకు వెలుగునిచ్చే గండ దీపం!

image

భూపాలపల్లి జిల్లా తిరుమలగిరి శివారు బుగులోని వెంకన్న స్వామి జాతరలో గండ దీపం బ్రహ్మోత్సవాలు పూర్తయ్యే వరకు వెలుగుతూ ఉంటుంది. మంగళవారం ఈ గండ దీపాన్ని వెలిగించి, 5 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు.ఈ దీపం వెలుగు కొండ చుట్టూ ఉన్న గ్రామాలకు కాంతితో విరజిల్లుతుంది. భక్తులు వెంకన్న స్వామిని స్మరిస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఇక్కడికి చేరుకుంటారు. ఈ దీపంలో నూనె పోసి కోరికలు కోరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

News November 4, 2025

BCలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0: సవిత

image

AP: BCల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సవిత పేర్కొన్నారు. ఆదరణ 3.0 పథకం అమలుపై వర్క్ షాప్‌ను ప్రారంభించారు. ‘BCలు సమిష్టిగా కూటమిని గెలిపించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వారెంతో నష్టపోయారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే BCలకు బడ్జెట్లో అత్యధికంగా నిధులు కేటాయించాం. వారి కాళ్లపై వారు నిలబడాలని ఆదరణ 3.0 పథకం అమలు చేస్తున్నాం. దానికి బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాం’ అని తెలిపారు.