News April 16, 2025
నేడు పిడుగులతో కూడిన వర్షాలు

AP: నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు, నిన్న రాత్రి 8 గంటల వరకు మన్యం జిల్లా పెదమేరంగిలో 47.5 మి.మీ. వర్షం పడగా, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News April 16, 2025
మైనారిటీలంటే ముస్లింలే కాదు: కిరణ్ రిజిజు

భారత్లో మైనారిటీలంటే కేవలం ముస్లింలే కాదని, 6మతాలకు చెందినవారిని అల్పసంఖ్యాక వర్గాలుగానే పరిగణిస్తారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. మైనారిటీ శాఖ మంత్రి అయినందునే జాతీయ వక్ఫ్ కౌన్సిల్ ఛైర్మన్గా నియమించారన్నారు. కాగా ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో నియమించడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందూ బోర్డుల్లో ముస్లింలను నియమిస్తారా? అని ప్రశ్నించింది.
News April 16, 2025
ALL TIME RECORD: రూ.లక్షకు చేరువలో గోల్డ్ రేట్

ఢిల్లీలో బంగారం ధర రూ.లక్షకు చేరువైంది. ఇవాళ సాయంత్రం రూ.1650 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఆల్టైం హైకి చేరి రూ.98,100గా నమోదైంది. US, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ఇన్వెస్టర్లు బంగారంపైకి భారీగా పెట్టుబడులు మళ్లిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ ధరకు అనుగుణంగా దేశీయంగా గోల్డ్ రేట్స్కు రెక్కలొచ్చాయి. అతిత్వరలోనే ఇది రూ.లక్షను తాకనున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
News April 16, 2025
15 ఏళ్ల తర్వాత మళ్లీ పాక్, బంగ్లా చర్చలు

పాక్, బంగ్లా మధ్య 15 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు రేపు ఢాకాలో భేటీ కానున్నారు. వాణిజ్య, భద్రతాపరమైన అంశాలపై వారు చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగ్లాకు తమ ఎగుమతుల్ని పెంచే ఆలోచనలో పాక్ ఉంది. అఫ్గాన్, ఇరాన్ నుంచి కూడా ఉత్పత్తుల్ని పాక్ ద్వారా బంగ్లాకు చేరవేయాలని ఆ దేశం భావిస్తున్నట్లు సమాచారం.