News April 16, 2025
తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమలాపురం (M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 24, 2025
సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం

కశ్మీర్ ఘటనలో మృతి చెందిన చంద్రమౌళికి ఘన నివాళి అర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. బుధవారం సాయంత్రం విశాఖ చేరుకున్న ఆయన చంద్రమౌళికి నివాళులు అర్పించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం అమరావతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడితో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్, తదితరులు వీడ్కోలు పలికారు.
News April 24, 2025
SRH ఘోర ఓటమి

IPLలో SRH ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇవాళ ఉప్పల్లో ముంబైతో జరిగిన మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 144 పరుగుల టార్గెట్ను ముంబై 15.4 ఓవర్లలోనే ఛేదించింది. రోహిత్ శర్మ 70 రన్స్తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. సూర్య 40*, జాక్స్ 22 రన్స్ చేశారు. ఈ ఓటమితో SRH ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతు కాగా ముంబైకి ఇది వరుసగా నాలుగో విజయం.
News April 24, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

ఉగ్రవాద దుశ్చర్యలను ఖండించిన ఏబీవీపీ
NGKL: 60 రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
కొల్లాపూర్లో BRS నాయకుడిపై దాడి
ఈత సరదా విషాదం కాకూడదు:SPలు
భూభారతి చట్టంపై రైతులకు అవగాహన
పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
వనపర్తి:Way2Newsతో జిహెచ్ఎం ఉమాదేవి
కొనసాగుతున్న ఓపెన్ SSC,INTER పరీక్షలు
వేసవిలో జాగ్రత్త…’Way2news’తో ఉపాధ్యాయులు
ప్రోగ్రెస్ కార్డుల పంపిణీ.. విద్యార్థుల సందడి