News April 16, 2025
HYD: మహిళా భద్రత కోసం T-SAFE యాప్

మహిళా భద్రత కోసం యువత టెక్నాలజీని వినియోగిస్తున్నారని మహిళా భద్రత విభాగం డీజీ షికా గోయల్ తెలిపారు. T-సేఫ్ ఆండ్రాయిడ్ యాప్ను ఇప్పటి వరకు 42,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. దీనివల్ల 36,263 ట్రిప్పులు నమోదు కాగా, 30% పైగా మూడు కమిషనరేట్ల పరిదివే, 65,000కుపైగా ఏజెంట్ కాల్స్ అందినట్లు పేర్కొన్నారు. మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు కృషి చేస్తున్నామని, T-SAFE యాప్ మీరూ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News April 16, 2025
రేపు తిరుపతికి రానున్న 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం

రెండు రోజుల జిల్లా పర్యటన నిమిత్తం గురువారం 16వ ఫైనాన్స్ కమిషన్ తిరుపతికి రానున్నట్లు తిరుపతి కలెక్టర్ డా.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ మేరకు విధులు కేటాయించబడిన అధికారులు బాధ్యతగా చేపట్టాలన్నారు.16వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్ డా.అరవింద్ పనగారియాతోపాటు 15 మంది సభ్యులతో కూడిన కమిషన్ ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 11 గంటలకు రేణిగుంటకు చేరుకుంటారని కలెక్టర్ చెప్పారు.
News April 16, 2025
మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ADB కలెక్టర్

భోరజ్ మండలం పూసాయిలో ఏర్పాటు చేయనున్న భూ భారతి రెవెన్యు సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొననున్న సందర్భంగా బుధవారం మంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. మంత్రితో ప్రారంభించే భూ భారతి పోర్టల్ సదస్సుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ వినోద్ కుమార్, డీఎస్పీ జీవన్రెడ్డి, తహశీల్దార్ రాజేశ్వరి ఉన్నారు.
News April 16, 2025
Dy.CMను కలిసిన ఎమ్మెల్యేలు రాగమయి, తెల్లం, కోరం

హైదరాబాద్లోని ప్రజాభవన్లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులతో పాటు ఆయా సమస్యలు గురించి చర్చించారు. ఆమె వెంట భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావ్ ఉన్నారు.