News March 27, 2024
నామినేషన్ వేసిన MP అభ్యర్థికి ED సమన్లు

శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ అభ్యర్థి అమోల్ కీర్తికర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కార్మికులకు ఆహారం పంపిణీకి సంబంధించి కాంట్రాక్టుల అప్పగింతలో ఆయన అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. కాగా.. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే అతణ్ని భయపెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ఈడీతో నోటీసులు పంపించినట్లు శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు.
Similar News
News March 17, 2026
ఈ జీవి పాలు నల్లగా ఉంటాయ్.. ఎందుకంటే?

సాధారణంగా ఏ జీవి పాలైనా తెలుపు రంగులో ఉంటాయి. కానీ ఖడ్గమృగం మాత్రం నల్లటి పాలు ఇస్తుంది. వీటిలో కొవ్వు శాతం చాలా తక్కువగా(0.2%) ఉండటమే దీనికి కారణం. ఇతర జంతువుల పాలలో కొవ్వు ఎక్కువగా ఉండి తెల్లగా కనిపిస్తాయి. కానీ ఖడ్గమృగం పాలలో నీరు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉండటంతో అవి నల్లగా ఉంటాయి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో
News March 17, 2026
IPLలో అత్యధిక పరుగుల వీరులు వీరే..

విరాట్ కోహ్లీ-8661 (267 మ్యాచులు)
రోహిత్ శర్మ- 7046 (272)
శిఖర్ ధవన్- 6769 (222)
డేవిడ్ వార్నర్- 6565 (184)
సురేశ్ రైనా- 5528 (205)
> మరి ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 9వేల మార్కును అందుకుంటారా? కామెంట్ చేయండి.
News March 17, 2026
ఉద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో DA హైక్?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల DAను మార్చి చివరి లేదా ఏప్రిల్ తొలి వారంలో పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 58% DAను 60% లేదా 61%కి పెంచే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. AICPI డేటా ప్రకారం కనీసం 2% పెంపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ పెంపు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. గత 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి అందే అవకాశం ఉంది. దీనివల్ల ‘బేసిక్ పే’ను బట్టి నెలకు రూ.వేలల్లో జీతం పెరగనుంది.


