News April 16, 2025
MHBD: రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం.. పౌర సరఫరాల శాఖ క్లారిటీ

రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం అబద్ధమని మహబూబాబాద్ జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ప్రేమ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీచేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఈ పుకార్లు నమ్మవద్దన్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు.
Similar News
News January 9, 2026
పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుంది: MLA

మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని, ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్లో శుక్రవారం టీజీఐఐసీ కార్పొరేషన్ ద్వారా సుమారు రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
News January 9, 2026
వాష్రూమ్లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

ఉదయ్పూర్(RJ)లోని లీలా ప్యాలెస్ హోటల్కు కన్జూమర్ కోర్టు ₹10 లక్షల జరిమానా విధించింది. చెన్నైకి చెందిన దంపతులు వాష్రూమ్లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది ‘మాస్టర్ కీ’తో గదిలోకి ప్రవేశించడమే దీనికి కారణం. వద్దని అరిచినా వినకుండా లోపలికి తొంగిచూసి ప్రైవసీకి భంగం కలిగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ‘Do Not Disturb’ బోర్డు లేనందునే లోపలికి వెళ్లామని యాజమాన్యం వాదించినా కోర్టు ఏకీభవించలేదు.
News January 9, 2026
TUలో రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

తెలంగాణ యూనివర్సిటీలో రేపటి నుంచి ఈ నెల 18 వరకు సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఆచార్య రవీందర్ రెడ్డి సర్కులర్ జారీ చేశారు. డిచ్పల్లిలోని మెయిన్ క్యాంపస్తో పాటు భిక్కనూరు సౌత్ క్యాంపస్, సారంగాపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్లకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు సంక్రాంతి సెలవుల అనంతరం పెండింగ్ మెస్ బిల్లులు చెల్లించి ఈ నెల 19న తరగతులకు హాజరు కావాలని సూచించారు.


