News April 16, 2025
MHBD: రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం.. పౌర సరఫరాల శాఖ క్లారిటీ

రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం అబద్ధమని మహబూబాబాద్ జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ప్రేమ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీచేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఈ పుకార్లు నమ్మవద్దన్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు.
Similar News
News January 7, 2026
సీతక్క, సురేఖ లేకుండానే ఇన్ఛార్జ్ మంత్రి రివ్యూ

ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులపై HNK కలెక్టరేట్లో ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రివ్యూ చేశారు. ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు పాల్గొనగా, జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ హాజరు కాలేదు. వారు లేకుండానే మంత్రి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులపై సమీక్షించారు. ములుగులో సీతక్క ఉండగా, సురేఖ హైదరాబాద్లో ఉన్నట్టు తెలిసింది.
News January 7, 2026
BREAKING: ప్రభాస్, చిరంజీవి సినిమాల నిర్మాతలకు ఊరట

రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్రాల నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్లో ఊరట లభించింది. టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పుష్ప-2, ఓజీ, గేమ్ ఛేంజర్, అఖండ-2 చిత్రాలకే పరిమితం చేసింది.
News January 7, 2026
బిక్కనూర్: ‘మరో ఉద్యమం స్టార్ట్ చేస్తాం’

బిక్కనూర్ మండల కేంద్రంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు <<18786879>>నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని<<>> పట్టణానికి చెందిన న్యాయవాది రాజబాబు గౌడ్, గ్రామస్థులు సూచించారు. ఈరోజు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల గ్రామాల వాతావరణం పూర్తిగా కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్ణయం వెనకకు తీసుకోకపోతే మరో ఉద్యమం స్టార్ట్ చేస్తామని హెచ్చరించారు.


