News April 16, 2025
ECIL నుంచి భూపాలపల్లి జిల్లాకు డ్రోన్ల అందజేత

ECIL తన సొంత మేధా సంపత్తితో 12 డ్రోన్లు, 20 ఎలక్ట్రిక్ బైకులను భూపాలపల్లి జిల్లాకు సమకూర్చినట్లుగా తెలిపింది. భూపాలపల్లి జిల్లా పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో తిరుగుతూ సేవలందించే సూపర్వైజర్లకు ఎలక్ట్రానిక్ బైక్లను అందిస్తారని పేర్కొంది. ఈ డ్రోన్ల ద్వారా వైద్య సేవలను సైతం మెరుగుపరచుకోవడం కోసం ఉపయోగించుకోవడానికి వీలుంటుందని ECIL తెలిపింది.
Similar News
News April 19, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 144 సెక్షన్: SP

ఆసిఫాబాద్ జిల్లాలో ఈనెల 20 నుంచి నిర్వహించనున్న ఇంటర్, పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్ష కేంద్రాల వద్ద BNSS 163 (144) సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రశ్నాపత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని పేర్కొన్నారు. గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ కేంద్రాలకు అనుమతించమన్నారు.
News April 19, 2025
మద్దూరు: సీఎం ఫోటోను అవమానపరిచినందుకు అరెస్ట్..!

కోటకొండ గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫోటోలను అవమానకరంగా ఎడిట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపులలో ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా ఫోటోలను షేర్ చేశాడు. ఈ ఘటనపై రేణివట్ల గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి యాసిన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
News April 19, 2025
NZB: మద్యం తాగుతూ.. పాటలు వింటూ మృతి(UPDATE)

నగరంలోని సుభాష్ నగర్లో ఆటోలో మృతి చెందిన వ్యక్తిని న్యూ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ బాలచందర్(36)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో పాటలు వింటూ మద్యం సేవిస్తుండగా ఒకసారిగా ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహన్ని మార్చురీకి తరలించారు.