News April 16, 2025

పార్వతీపురం: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్

image

పార్వతీపురం ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యను అందించేందుకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రైమరీ లెవెల్ ఎస్జీటీలు 45, సెకండరీ లెవెల్ స్కూల్ అసిస్టెంట్లు115, ముందుగా విడుదలైన 49, ప్రస్తుతం మంజూరు చేసిన 66 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 8, 2026

త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ: CM

image

TG: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు CM రేవంత్ తెలిపారు. సచివాలయంలో CMతో హిమాచల్‌ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ భేటీ అయ్యారు. ‘అన్ని వర్గాల విద్యార్థులకు ఒకే చోట రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ విద్య అందిస్తాం. చిన్నారులను స్కూళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించే అంశంపై యోచిస్తున్నాం’ అని CM వివరించారు.

News January 8, 2026

‘వికసిత్ భారత్-స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో నంద్యాల జిల్లా ముందుండాలి’

image

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాల సాధనకు ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఇరవై సూత్రాల కార్యక్రమ అమలు ఛైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్యంపై కలెక్టర్ జి. రాజకుమారితో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీబీ-జీ రామ్ జీ, వైద్య-ఆరోగ్యం, విద్య, జల్ జీవన్ మిషన్, అమృత్, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.

News January 8, 2026

బంగ్లాదేశ్‌లో హిందువు హత్య.. ప్రధాన నిందితుడు అరెస్టు

image

బంగ్లాదేశ్‌లో సంచలనం రేపిన హిందువు <<18624742>>దీపూ దాస్ హత్య<<>> కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ టీచర్ యాసిన్ అరాఫత్‌ను ఇవాళ పట్టుకున్నారు. ‘దీపూ దాస్‌పై దాడికి ప్లానింగ్, అమలులో ఇతడు కీలకపాత్ర పోషించాడు. గుంపును ఎగదోయడం మాత్రమే కాదు.. దీపూను స్వయంగా కూడలిలోకి లాక్కెళ్లాడు. ఇన్నిరోజులు పరారీలో ఉన్నాడు’ అని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు.