News April 16, 2025

పబ్‌లో HYD అమ్మాయిలతోనూ డాన్సులు

image

HYD చైతన్యపురిలోని పబ్‌లో యువతులతో <<16103579>>అర్ధనగ్న<<>> డాన్సులు చేయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. కాగా.. ఇందులో ముంబై యువతులే కాకుండా HYDలోని వనస్థలిపురం, ఉప్పల్, సికింద్రాబాద్ అమ్మాయిలతోనూ డాన్సులు చేయిస్తున్నట్లు గుర్తించారు. యువకులను ఆకర్షించేందుకు పబ్‌లోకి ఫ్రీగా పంపించి, వారికి కంపెనీ ఇస్తూ అధికమొత్తంలో ఖర్చు చేయించి ఆ బిల్ కూడా వారితో కట్టిస్తున్నట్లు అధికారులు తేల్చారు.

Similar News

News December 27, 2025

రూ.22 కోట్ల గంజాయిని తగలబెట్టాం: భద్రాద్రి ఎస్పీ

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఏడాదిలో 70 కేసుల్లో మొత్తం 221 మందిని అరెస్టు చేయడంతో పాటు వీరి నుంచి కోట్ల విలువగల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఇందులో 5,707 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సుమారుగా రూ.22 కోట్ల గంజాయిని ఈ ఏడాది తగులబెట్టడం జరిగిందని వార్షిక నివేదిక ద్వారా వివరాలు వెల్లడించారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.

News December 27, 2025

జిల్లాలో మహిళలపై తగ్గిన నేరాలు: ఎస్పీ రోహిత్ రాజు

image

భద్రాద్రి జిల్లాలో మహిళల భద్రతకు తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల వల్ల వారిపై జరుగుతున్న నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మహిళలపై జరిగిన నేరాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. గత ఏడాది జిల్లావ్యాప్తంగా 420 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 384కి తగ్గిందని వివరించారు. అంటే మొత్తం మీద మహిళలపై నేరాలు 8.57 శాతం తగ్గాయని వెల్లడించారు.

News December 27, 2025

నేర శాతం 9.65 శాతం పెరిగింది: భద్రాద్రి ఎస్పీ

image

భద్రాద్రి జిల్లా పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో ముందంజలో ఉన్నామని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వార్షిక నివేదిక-2025 వార్షిక నివేదిక బుక్ లెట్‌ను విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే 9.65 శాతం నేరాల శాతం పెరిగిందని అన్నారు.