News April 16, 2025
వేటపాలెం: విద్యుత్ షాక్తో ఒకరి మృతి

విద్యుత్ వైరు తగిలి ఒక వ్యక్తి చనిపోయిన ఘటన వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ M. వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. అనుమల్లి పేటకు చెందిన వ్యక్తి ఇంటికి వెళ్లే క్రమంలో వర్షం కారణంగా తెగిపడిపోయిన వైరు అడ్డంగా ఉండడాన్ని గమనించి దాన్ని తప్పించే క్రమంలో పట్టుకున్నాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ తగిలి బొడ్డు మోహన్ రావు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Similar News
News December 28, 2025
పెంచలకోనపై వీడని పీటముడి.. అటా.. ఇటా?

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుంది నెల్లూరు జిల్లా పరిస్థితి. గూడూరును నెల్లూరులో కలపడానికే CM సానుకూలత వ్యక్తం చేశారట. వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలపై మాత్రం పీటముడి వీడటం లేదు. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరులో కలపాలన్న గట్టి డిమాండ్ ఉంది. కలువాయి(M)న్ని నెల్లూరులో, సైదాపురం, రాపూరు(M)న్ని మాత్రం తిరుపతిలోనే ఉంచనున్నారట. దీంతో పెంచలకోన తిరుపతిలోనే ఉండనుంది.
News December 28, 2025
HYD: కాళ్ల పారాణి ఆరకముందే.. కాటికి (Rewind)

కాళ్ల పారాణి ఆరకముందే ఆడబిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కట్టుకున్నవాడు కంటికి రెప్పలా చూసుకుంటాడని నమ్మితే.. అదనపు కట్నం కోసం వేధించి కాటికి పంపుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ HYDలో పరిధిలో గత 11 నెలల్లోనే దాదాపు 16 మంది మహిళలు వరకట్న వేధింపులకు బలైనట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కట్న దాహంతో అత్తారింటి వేధింపులు మితిమీరడంతో వధువుల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి.
News December 28, 2025
KMR: వ్యవసాయ విస్తరణ అధికారుల నూతన కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి జిల్లా తెలంగాణ వ్యవసాయ విస్తరణ సంఘం నూతన జిల్లా అధ్యక్షుడిగా కట్కూరి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా ఎమ్.రాఘవేంద్ర, సలహాదారులుగా జె.శ్రవణ్ కుమార్, సహాధ్యక్షులుగా జీ.వై ప్రభకర్, కోశాధికారిగా ఏస్.ఏ.మూకీద్ ఉపాధ్యక్షులుగా ఎస్.శ్యామ్ సుందర్ రెడ్డి, బి.పవిత్రన్, కె.లిఖిత్ రెడ్డి, పి.శ్రీలత, సంయుక్త కార్యదర్శులుగా జి.రాజాగౌడ్, కె.క్రిష్ణా రెడ్డి, శివ చైతన్య, సౌజన్య ఏకగ్రీవంగా ఎన్నికైనారు.


