News April 16, 2025
కొత్తగూడెం: యువతిని మోసం చేశాడు

కొత్తగూడెం జిల్లా ఇల్లందుకి చెందిన ఏసుదాస్ డేవిడ్(43) పెళ్లి చేసుకుంటా అని యువతిని(21) గర్భవతి చేశాడు. సీఐ జె.ఉపేందర్ వివరాలు.. ఇల్లెందుకు చెందిన బి.ఏసుదాస్ డేవిడ్ మల్లంపేటలో ఉంటూ ఓ యువతిని ప్రేమిస్తున్నా అంటూ శారీరికంగా వాడుకున్నాడు. పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తేగా మొహం చాటేశాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 11, 2025
వైద్యుల నిర్లక్ష్యం.. వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు

TG: నార్కట్పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్యంతో మహిళ మరణించిన కేసులో నల్గొండ జిల్లా వినియోగదారులు ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. నెలలోగా డబ్బు చెల్లించకపోతే 9% వడ్డీతో చెల్లించాలని పేర్కొంది. ఆరెగూడెంకు చెందిన స్వాతి డెలివరీ కోసం ఆసుపత్రిలో చేరగా వైద్యం వికటించి మరణించింది. దీనిపై బాధిత కుటుంబసభ్యులు ఫోరంను ఆశ్రయించారు.
News November 11, 2025
JGTL: నిరుద్యోగ మహిళలకు NOV 14న జాబ్ మేళా

JGTL జిల్లాలోని నిరుద్యోగ మహిళల జాబ్ మేళాను 14వ తేదీ ఉదయం 10గంటల నుంచి పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించనున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ మొబైల్ కంపెనీలో ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు సర్టిఫికెట్ల జిరాక్స్, 2 ఫొటోలు తీసుకునివెళ్లాలి. భోజన వసతి ఉంటుంది. ఈ జాబ్ మేళా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సహకారంతో టి.సదాశివ్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనుంది. SHARE IT.
News November 11, 2025
ములుగు: పథకం ప్రకారమే లొంగిపోయారు: ‘మావో’ లేఖ

ఇటీవల లొంగిపోయిన మాజీ మావోయిస్టులు సోను, సతీశ్లకు మావోయిస్టు పార్టీ పంథాను తప్పుపట్టే హక్కు లేదని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. సోను, సతీశ్లు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకొని పథకం ప్రకారం లొంగిపోయారన్నారు. అక్టోబర్ 13 నుంచి 16వ తేదీ వరకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు అడవుల్లో మోహరించాయన్నారు.


