News April 16, 2025
కంది: డీఎస్సీ-2008 ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జీతాలు

జిల్లాలో డీఎస్సీ-2008 ద్వారా ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జీతాలు ఇవ్వాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 63 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ, మండల పరిషత్ యాజమాన్యంలో ఫిబ్రవరి నెలలో నియామకం అయ్యారని వీరందరికీ ట్రెజరీ ద్వారానే జీతాలు అందనున్నాయని పేర్కొన్నారు.
Similar News
News January 17, 2026
నేటి ముఖ్యాంశాలు

✴ 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం: సీఎం రేవంత్
✴ ఉమ్మడి ఆదిలాబాద్లో సదర్మట్, చనాక-కొరాటా బ్యారేజీలను ప్రారంభించిన సీఎం
✴ మేడారంలో ఒక్కరోజే 6 లక్షల మంది భక్తుల దర్శనం
✴ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల
✴ ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి: లోకేశ్
✴ రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలితీసుకుంటారు?: జగన్
✴ ‘సంక్రాంతి’ తిరుగు ప్రయాణాలు.. బస్సులు, రైళ్లలో రద్దీ
News January 17, 2026
WPL: RCB హ్యాట్రిక్ విజయం

WPLలో ఆర్సీబీ వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 182 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ తడబడినా రాధా యాదవ్ 66 పరుగులతో జట్టును నిలబెట్టారు. రిచా ఘోష్ 44 పరుగులతో మద్దతు ఇవ్వగా, చివర్లో క్లర్క్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఛేజింగ్లో గుజరాత్ 150 పరుగులకు పరిమితమైంది. శ్రేయాంక పాటిల్ 5 వికెట్లు తీశారు.
News January 17, 2026
వరంగల్: గ్రూప్-3లో ఎంపికైన అభ్యర్థికి నియామక ఉత్తర్వులు: వీసీ

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్-3 ఉద్యోగ నియామక పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థికి వరంగల్ కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఉద్యోగ నియామకం చేస్తూ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ రమేశ్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు అందజేశారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ డాక్టర్ మల్లేశ్వర్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


