News April 16, 2025
మదనపల్లె: ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటి పాలెం వద్ద రైతులు వన్య ప్రాణుల నుంచి పంట రక్షణకు పొలాల చుట్టూ అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయాన్నే గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి సమీపంలోకి చిరుత రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News March 6, 2026
NGKL: తగ్గనున్న హైదరాబాద్-తిరుపతి ప్రయాణం.. అటవీశాఖ గ్రీన్సిగ్నల్

కృష్ణానదిపై సోమశిల వద్ద నిర్మించబోయే ఐకానిక్ వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం 24.66 హెక్టార్ల అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. AP-TG రాష్ట్రాల మధ్య అనుసంధానకర్తగా నిలిచే ఈ వంతెన నిర్మాణం కోసం కేంద్రం వెయ్యి కోట్లకుపైగా నిధులను కేటాయించనుంది. ఈ ప్రాజెక్టు సాకారమైతే HYD-తిరుపతి మధ్యదూరం 80 కిమీ తగ్గనుంది.
News March 6, 2026
BREAKING: తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.770 తగ్గి రూ.1,62,110కు చేరింది. ఐదు రోజుల్లోనే రూ.10,980 తగ్గడం విశేషం. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.700 పతనమై రూ.1,48,600గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 6, 2026
VZM: అందొచ్చిన కొడుకు అకాలమరణం

విజయనగరం జిల్లాలో తెల్లవారుజామున జరిగిన <<19308463>>రోడ్డు ప్రమాదం<<>>లో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు దత్తిరాజేరు (M) పెదమానాపురం గ్రామానికి చెందిన రౌతు నానిగా గుర్తించారు. నాని, రౌతు సాయి, గెద్ద శేఖర్, సాయి స్నేహితుడు ప్రయాణిస్తున్న కారు గజపతినగరం (M) మరుపల్లి వద్ద అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. అందొచ్చిన కొడుకు అకాలమరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


