News March 27, 2024
167 మంది అభ్యర్థులను ప్రకటించిన కూటమి
AP: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి సిద్ధమవుతోంది. అందులో భాగంగా మొత్తం 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను ఎన్డీఏ కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News October 4, 2024
ప్రకాశం: ‘బాణసంచా విక్రయాలకు దరఖాస్తు చేసుకోవాలి’
ప్రకాశం జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత శుక్రవారం తెలియజేశారు. ఆసక్తికలిగిన వారు తాత్కాలిక లైసెన్స్ కోసం ఈనెల 15లోగా మీసేవ కేంద్రాలు, సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తహశీల్దార్లు, పోలీసు అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించి దీపావళి బాణసంచాను విక్రయించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.
News October 4, 2024
హార్దిక్ బౌలింగ్పై కోచ్ మోర్కెల్ అసంతృప్తి!
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ కోసం ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తిరిగి భారత జట్టులో చేరనున్నారు. అయితే ప్రాక్టీస్ సెషన్లో భాగంగా నెట్స్లో హార్దిక్ పాండ్య బౌలింగ్ చేసిన తీరుపై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రతి డెలివరీ తర్వాత హార్దిక్ దగ్గరికి వెళ్లి సలహాలు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. అక్టోబర్ 6న 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
News October 4, 2024
ఇండియాలో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్స్
ఇండియాలో మరో 4 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలోనే యాపిల్కు చెందిన రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది బెంగళూరు, పుణే, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో మరో నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్లో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. మేడ్-ఇన్-ఇండియా iPhone 16 Pro, Pro Maxల సరఫరా ఈనెల నుంచి ప్రారంభంకానుంది.