News April 16, 2025

అచ్చంపేట: గుర్తు తెలియని వ్యక్తి మృతి.. మార్చిరీలో శవం

image

అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని ఈగలపెంట ఎస్ఐ వీరమల్లు తెలిపారు. అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో గత కొన్ని రోజులుగా భిక్షాటన చేస్తూ ఉండేవాడని అనారోగ్యంతో బాధపడుతున్న అతడిని అచ్చంపేట హాస్పిటల్‌కి గ్రామస్థులు తరలించారని ఆయన పేర్కొన్నారు. ఈయనను గుర్తుపట్టినవారు ఈగల పెంట పీఎస్, 8712657739, 8712657741, 9000901668 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Similar News

News September 19, 2025

భీమడోలు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదు

image

ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటలలో కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భీమడోలు మండలంలో అత్యధికంగా 16.2 మి.మీ., నూజివీడులో 2.8 మి.మీ, చాట్రాయిలో 1.8 మి.మీ, అగిరిపల్లిలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన 24 మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 22.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 0.8 మి.మీ.గా ఉందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు.

News September 19, 2025

సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

image

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.

News September 19, 2025

HYD: సోషల్ మీడియా వాడుతున్నారా? జాగ్రత్త!

image

సోషల్ మీడియా వాడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని HYD పోలీసులు సూచించారు. పోస్ట్ చేసే ముందు ఆలోచించండి. వ్యక్తిగత, సున్నితమైన వివరాలు పంచుకోవద్దు. మీ భద్రత, గౌరవం మీరు పంచుకునే విషయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఒక క్లిక్‌తోనే అంతటా వ్యాప్తి చెందుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పోస్ట్ చేయండి. పంచుకునే ముందు ధ్రువీకరించండి. తప్పుడు సమాచారం అందరికీ హానికరంగా మారుతుందన్నారు.