News April 16, 2025
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్

AP: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లను ఏప్రిల్ 24న రిలీజ్ చేయనున్నారు. ఆ రోజు ఉ.10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. వృద్ధులు, దివ్యాంగుల కోటా టికెట్లను ఏప్రిల్ 23 మ.3 గంటలకు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు ఏప్రిల్ 23న ఉ.10 గంటలకు అందుబాటులో ఉండనున్నాయి.
Similar News
News January 7, 2026
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా? క్లారిటీ

బీరు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయనేది అపోహ మాత్రమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవాళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. నీరు ఎక్కువగా తాగాలి. బీరు తాగితే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. కిడ్నీలు ఒత్తిడికి గురై రాళ్లు పెరిగే ప్రమాదం ఉంటుంది. బీరులోని ప్యూరిన్తో యూరిక్ యాసిడ్ పెరిగి కొత్త రాళ్లు ఏర్పడవచ్చు. మూత్రంలో ప్రెజర్ పెరిగి రాయి బ్లాడర్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది.
News January 7, 2026
జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు – కలుపు నివారణ

జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగులో కలుపు నివారణకు మొదటి 20- 25 రోజులు కీలక దశ. వరికొయ్యలపై పొద్దుతిరుగుడు విత్తిన రోజు ముందుగా లీటరు నీటికి పారక్వాట్ కలుపు మందు 5mlను కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 24-48 గంటలలోపు తేమ గల నేలపై పెండిమిథాలిన్ కలుపు మందును లీటరు నీటికి 5 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి. పంట 25-30 రోజుల దశలో లీటరు నీటికి క్విజాలోఫోప్ ఈథైల్ 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
News January 7, 2026
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఒకే ఓవర్లో 4,6,4,6

సౌతాఫ్రికా U-19తో మూడో వన్డేలో భారత విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయారు. 7వ ఓవర్లో వరుసగా 4,6,4,6 బౌండరీలు బాదారు. ఈక్రమంలోనే అతడు 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. ప్రస్తుతం వైభవ్(56)తో పాటు ఆరోన్ జార్జ్(51) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 10 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 111 రన్స్ జోడించారు.


