News April 16, 2025

గుండెపోటుతో మాజీ MLA మృతి

image

AP: కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే జి.లోక్‌నాథ్ (75) గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తుదిశ్వాస విడిచారు. 1989లో ఆలూరు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రంగన్న (టీడీపీ)పై గెలిచారు. లోక్‌నాథ్ స్వగ్రామం ఆలూరు మండలంలోని మొలగవల్లి. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Similar News

News November 12, 2025

స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజం: కిరణ్ బేడీ

image

పేదరికం, నిరుద్యోగంతో యువత ఉగ్ర, తీవ్రవాదాల వైపు మళ్లుతున్నారన్నది పాత వాదన. కానీ అదిప్పుడు వైట్ కాలర్ అఫెన్సుగా మారింది. తాజాగా పట్టుబడ్డవారంతా డాక్టర్లు, ప్రొఫెసర్లే. సరిహద్దుల్ని దాటి దేశంలో స్లీపర్ సెల్స్ రూపంలో టెర్రరిజమ్ వ్యాపించిందని మాజీ IPS కిరణ్ బేడీ ఇండియాటుడే చర్చలో పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని, ప్రజల సహకారంతో అన్ని రాష్ట్రాల భద్రతా విభాగాలు ఉగ్రవాదాన్ని పూర్తిగా తుదముట్టించాలన్నారు.

News November 12, 2025

‘తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా చూడండి’

image

AP: మొంథా తుఫాన్ నష్టంపై వేగంగా నివేదిక ఇచ్చి.. రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కేంద్ర బృందాన్ని సీఎం చంద్రబాబు కోరారు. తుఫాన్ వల్ల రూ.6,384 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.2,622 కోట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్రం బృందం CMతో సమావేశమైంది. తడిసిన ధాన్యం కొనుగోలుకు నిబంధనలు సవరించేలా కేంద్రానికి సిఫార్సు చేయాలని బృంద సభ్యులను సీఎం కోరారు.

News November 12, 2025

SBIలో మేనేజర్ పోస్టులు

image

<>SBI <<>>10 మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ , బీఈ, బీటెక్, MBA/PGDBM/PGDBA అర్హతతో పాటు పని అనుభవంగల అభ్యర్థులు డిసెంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. మేనేజర్ పోస్టుకు 28- 40ఏళ్ల మధ్య, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 25 -35ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.750. SC, ST, PWBDలకు ఫీజు లేదు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in