News April 16, 2025

VZM: స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు

image

విజయనగరం ఉమ్మడి జిల్లాలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యను అందించేందుకు నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ప్రైమరీ లెవెల్ SGTలు 45, సెకండరీ లెవెల్ స్కూల్ అసిస్టెంట్లు 115 కాగా గతంలోనే 49 పోస్టులు మంజూరు చేసింది. తాజాగా 66 పోస్టులను కేటాయిస్తూ డీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రకటించింది.

Similar News

News July 7, 2025

రంప : 9000మంది విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్

image

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో 21 గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని ITDA. PO. సింహాచలం సోమవారం ప్రకటనలో తెలిపారు. దాదాపు 9 వేల మంది బాల, బాలికలకు వీటిని అందజేస్తామన్నారు. డిటర్జెంట్ సోప్స్, పౌడర్, బాత్ సోప్స్, షాంపు పాకెట్స్, కోకోనట్ ఆయిల్, వేజలైన్, టూత్ పేస్ట్, బ్రష్ తదితర వస్తువులు ఉంటాయని తెలిపారు.

News July 7, 2025

ముల్డర్ సరికొత్త చరిత్ర

image

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.

News July 7, 2025

2047 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తాం: మంత్రి కందుల

image

ఆంధ్రప్రదేశ్ విజన్ యాక్షన్ ప్లాన్-2047లో భాగంగా ఉపాధి, సాంఘిక గౌరవం, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రూపొందించిన P-4 కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. సోమవారం నిడదవోలులో మంత్రి మాట్లాడారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో P-4 రూపొందించినట్లు చెప్పారు.