News April 16, 2025
ఇండియన్ రైల్వేస్కు నేటితో 172 ఏళ్లు పూర్తి: అశ్వినీ వైష్ణవ్

భారతీయ రైల్వే వ్యవస్థ ప్రారంభమై నేటితో 172 సంవత్సరాలు పూర్తయ్యాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు. 1853 ఏప్రిల్ 16న బోరిబందర్- ముంబై-థానే మధ్య, సింద్, సుల్తాన్, సాహిబ్ అనే మూడు ఇంజిన్లతో రైలు నడిచిందని తెలిపారు. తొలి రైలులో 400మంది ప్యాసింజర్లు ఉండగా 34 కిలోమీటర్లు ప్రయాణం చేసిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి నేటి వరకూ భారతీయ రైల్వే నిరంతరాయంగా సేవలందిస్తోందని ట్వీట్ చేశారు.
Similar News
News December 30, 2025
కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్

AP: లైఫ్ ట్యాక్స్ వర్తించే వాహనాలపై ఆ పన్నులో 10% చొప్పున “రోడ్ సేఫ్టీ సెస్” వసూలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఆ మొత్తాన్ని రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు బదిలీ చేసి రోడ్ల మెరుగుదల, భద్రతా చర్యలకు వినియోగిస్తామని పేర్కొంది. ఈ సెస్ ద్వారా సంవత్సరానికి రూ.270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. GST తగ్గింపుతో వాహనాల రేట్లు తగ్గాయని, వాహనదారులకు ఈ సెస్ భారం కాబోదని తెలిపింది.
News December 30, 2025
శివతత్వం: కరుణామయ సంకల్పం

మూడో కంటితో విశ్వాన్ని భస్మం చేసే కాలరుద్రుడైనప్పటికీ భక్తుల పట్ల అపారమైన కరుణ చూపే భోళాశంకరుడి నుంచి మనమెంతో నేర్చుకోవాలి. తనను నమ్మిన వారిని ఆదుకోవడానికి ఎంతటి సాహసానికైనా పూనుకుంటాడు. బలహీనులను రక్షిస్తూ, ఆర్తులను ఆదుకుంటడు. తోటివారి పట్ల కరుణ చూపి, ఇతరుల తప్పులను క్షమించే గుణం అలవర్చుకోవడమే నిజమైన శివతత్వం. ప్రతికూలతలను జయించి, ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడం శివుడి నుంచి నేర్చుకోవాలి.
News December 30, 2025
MAIDSలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు..

న్యూఢిల్లీలోని మౌలానా అజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్(<


