News April 16, 2025
KMR: నీటి ఎద్దడి నివారణకు ట్యాంకర్ల ద్వారా సరఫరా: కలెక్టర్

కామారెడ్డి జిల్లాలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నూతనంగా కొనుగోలు చేసిన నీటి ట్యాంకర్లకు బుధవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో నీటి సరఫరాకు ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
Similar News
News November 8, 2025
TODAY HEADLINES

✦ ₹1,01,899Cr పెట్టుబడులకు CM CBN ఆమోదం
✦ బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP
✦ TG: ఫీజు బకాయిల విడుదలకు ప్రభుత్వం అంగీకారం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్
✦ కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్
✦ వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: PM
✦ టెక్నికల్ సమస్య.. ఢిల్లీ, ముంబైలో విమాన సేవలకు అంతరాయం
News November 8, 2025
వాట్సాప్లో క్రాస్ ప్లాట్ఫామ్ మెసేజింగ్ ఫీచర్!

వాట్సాప్ క్రాస్ ప్లాట్ఫామ్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు ఇతర మెసేజింగ్ యాప్స్ నుంచి వాట్సాప్కు మెసేజ్ చేయొచ్చు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్ వంటి ఫైళ్లను థర్డ్ పార్టీ యాప్స్కు పంపొచ్చు. అయితే స్టేటస్లు, డిసప్పియరింగ్ మెసేజులు, స్టిక్కర్లు అందుబాటులో ఉండవు. ఇది టెస్టింగ్ దశలో ఉందని, వచ్చే ఏడాది అందుబాటులోకి రావొచ్చని ‘వాబీటా ఇన్ఫో’ పేర్కొంది.
News November 8, 2025
జగిత్యాల: మక్కలు క్వింటాల్ ధర రూ.2075

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2075, కనిష్ఠ ధర రూ.1700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.1921, కనిష్ఠ ధర రూ.1815, వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2051, కనిష్ఠ ధర రూ.1900, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2550, కనిష్ఠ ధర రూ.1875గా పలికాయని మార్కెట్ కార్యదర్శి తెలిపారు.


