News April 16, 2025
IPL జట్లకు BCCI అలర్ట్!

HYDకు చెందిన ఓ వ్యాపారవేత్త IPL జట్ల ఓనర్లు, ప్లేయర్లు, కోచ్లను ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నట్లు BCCI గుర్తించిందని Cricbuzz పేర్కొంది. వారిని ఫిక్సింగ్ వంటి కార్యకలాపాల్లో భాగం చేయాలని అతడు చూస్తున్నాడని, జట్లన్నీ అప్రమత్తంగా ఉండాలని BCCI జట్లకు సూచించినట్లు తెలిపింది. సదరు వ్యక్తికి బుకీలతో సంబంధాలున్నాయని, అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు రిపోర్ట్ చేయాలని జట్లను బోర్డు ఆదేశించినట్లు సమాచారం.
Similar News
News November 4, 2025
నెల్లూరు సెంట్రల్ జైలుకు జోగి రమేశ్

AP: కల్తీ మద్యం కేసులో అరెస్టైన జోగి రమేశ్ను విజయవాడ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జైలు వద్ద ఆయనతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, MLC చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. CBNను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని కాకాణి మండిపడ్డారు. TDPకి అంటుకున్న బురదను YCP నేతలపై చల్లుతున్నారని ఆరోపించారు. మరోవైపు రమేశ్ను అకస్మాత్తుగా నెల్లూరు జైలుకు ఎందుకు తరలించారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
News November 4, 2025
నేపాల్లో ఏమైందో తెలుసు కదా?.. పోర్న్ బ్యాన్ పిల్పై సుప్రీంకోర్టు

దేశంలో పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిల్ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ సందర్భంగా నేపాల్లో జరిగిన Gen Z నిరసనలను ప్రస్తావించింది. ‘సోషల్ మీడియాను నిషేధించడం వల్ల నేపాల్లో ఏం జరిగిందో చూశారు కదా?’ అని CJI బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. 4 వారాల తర్వాత విచారిస్తామని స్పష్టంచేసింది. అయితే నవంబర్ 23నే జస్టిస్ గవాయ్ రిటైర్ కానుండటం గమనార్హం.
News November 4, 2025
రాత్రంతా ఆలోచిస్తూ, ఒంటరిగా ఉంటూ.. మృత్యుంజయుడి ఆక్రందన!

అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన <<16688689>>మృత్యుంజయుడు<<>> రమేశ్ మానసికంగా కుంగిపోతున్నాడు. ‘ప్రమాదంలో తమ్ముడిని కోల్పోయా. ఆ ఘటన పదే పదే గుర్తొస్తోంది. రాత్రంతా ఆలోచిస్తూ, మేలుకొనే ఉంటున్నా. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నా. నా భార్యతో, కొడుకుతోనూ మాట్లాడటం లేదు. మానసికంగా బాధపడుతున్నా. 4 నెలలుగా అమ్మ మాట్లాడట్లేదు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.


