News March 27, 2024
క్షమించండి: సీఎం జగన్
AP: ఇటీవల సీఎం జగన్ సభల్లో ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తాజాగా ప్రొద్దుటూరు సభలో ప్రసంగించిన తర్వాత జగన్ ప్రజలను క్షమించమని కోరారు. ‘చీకటి పడింది కాబట్టి సెక్యూరిటీ వాళ్లు ర్యాంప్ వాక్ వద్దంటున్నారు. ఈసారికి క్షమించమని అడుగుతున్నా’ అని కోరారు. ఇక ప్రతి ఇంటికీ సంక్షేమం అందాలంటే జగనన్నే సీఎం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News October 4, 2024
ఇండియాలో మరో నాలుగు యాపిల్ రిటైల్ స్టోర్స్
ఇండియాలో మరో 4 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలోనే యాపిల్కు చెందిన రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది బెంగళూరు, పుణే, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో మరో నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్లో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. మేడ్-ఇన్-ఇండియా iPhone 16 Pro, Pro Maxల సరఫరా ఈనెల నుంచి ప్రారంభంకానుంది.
News October 4, 2024
తండ్రి ప్రేమ.. ప్రాణాలకు తెగించి కూతురి కోసం..!
తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ప్రత్యేక బంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కూతురి సంతోషం కోసం తండ్రి ఎంతైనా కష్టపడుతుంటాడు. అలాంటి ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 50kms నడిచారు. హెలెన్ హరికేన్ USలో విధ్వంసం సృష్టించింది. వరదలు ముంచెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ తండ్రి జోన్స్ సౌత్ కరోలినా నుంచి కూతురు ఎలిజబెత్ పెళ్లి జరిగే జాన్సన్ సిటీకి 12 గంటల్లో చేరుకున్నారు.
News October 4, 2024
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
TG: హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ KA పాల్ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారించింది. కూల్చివేతలను ఇప్పటికిప్పుడు నిలిపివేయలేమంది. పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, హైడ్రాకు నోటీసులు ఇచ్చింది. పిటిషన్లో G.O.99పై స్టే విధించాలని, కూల్చివేతలకు 30రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని పాల్ కోరారు. తదుపరి విచారణ ఈనెల 14న జరగనుంది.