News April 16, 2025

AP ప్రభుత్వ సలహాదారుగా దమ్మపేట వాసి నియామకం

image

కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన రిటైర్డ్ IFS ఉద్యోగి పసుమర్తి మల్లిఖార్జునరావును ఏపీ కూటమి ప్రభుత్వ సలహాదారు(అటవీ అభివృద్ధి కార్యకలాపాలు)గా నియమిస్తూ ఏపీ సీఎస్ వజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. అటవీ అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి నియమించారు. ఈయన పదవీకాలం రెండేళ్లు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మండల వాసులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Similar News

News September 17, 2025

SRCL: ‘మహిళల ఆరోగ్యానికి ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి’

image

మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌‌లోని సమావేశ మందిరంలో ఆయన ‘స్వస్త్ నారీ, సాశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించి అవగాహన పెంచడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News September 16, 2025

సకాలంలో బాల సంజీవిని కిట్లు అందించాలి: జేసీ

image

బాల సంజీవిని కిట్లను సకాలంలో అంగన్వాడీ కేంద్రాలకు అందేలా పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను జేసీ రాహుల్ ఆదేశించారు. మంగళవారం భీమవరంలో జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం మానిటరింగ్ రివ్యూ కమిటీ సమావేశాన్ని సంబంధిత కమిటీ సభ్యులతో నిర్వహించారు. గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ప్రతినెలా అందిస్తున్న పోషకాహార సరుకులను నాణ్యతతో నిర్ణీత సమయానికి అందజేయాలన్నారు.

News September 16, 2025

ఈనెల 18న వేములవాడ హుండీ లెక్కింపు

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో హుండీ లెక్కింపు ఈనెల 18న ఉదయం 8 గంటలకు జరగనుంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ లెక్కింపులో భక్తులు సమర్పించిన నోట్లు, నాణేలు, బంగారం, వెండి ఆభరణాలు ఉంటాయని చెప్పారు. అధికారుల సమక్షంలో, లెక్కింపు కమిటీ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.