News April 16, 2025
కార్పొరేట్ తరహా వైద్య సేవలు: MLA వీరేశం

పేదలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన వైద్యం అందించడమే ప్రధాన ధ్యేయమని MLA వీరేశం అన్నారు. నకిరేకల్లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ఆస్పత్రిని పనులను పరిశీలించారు. 95% నిర్మాణ పనులు పూర్తయ్యాయని, 5 ఆపరేషన్ థియేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్పొరేట్ వైద్యం తరహాలో ఇక్కడ వైద్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయని, ఆసుపత్రిని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు.
Similar News
News September 16, 2025
ట్రంప్ హింట్.. అమెరికా చేతికి TikTok!

సెప్టెంబర్ 17కల్లా టిక్ టాక్ పగ్గాలు అమెరికా చేతికి రాకపోతే ఆ యాప్ను తమ దేశంలో బ్యాన్ చేస్తామని US ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై చైనా-అమెరికా ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ‘దేశంలోని యువత ఎంతగానో కోరుకుంటున్న ఓ డీల్ దాదాపుగా పూర్తైంది’ అని అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ చేశారు. త్వరలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడనున్నారు. డీల్ కోసం ఫ్రేమ్ వర్క్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
News September 16, 2025
సంగారెడ్డి: ఇన్స్పైర్ నామినేషన్ గడువు పెంపు

ఇన్స్పైర్ అవార్డ్స్ (Inspire Awards) నామినేషన్ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా, విద్యార్థులకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు, గైడ్ టీచర్లు, జిల్లా, డివిజన్, మండల మానిటరింగ్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News September 16, 2025
ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్ ఇదే!.

ప్రొద్దుటూరు చరిత్రలోనే కాస్ట్లీ ఎగ్జిబిషన్తో మున్సిపాలిటీకి రూ.1,91,44,00లు, ఆర్థిక శాఖకు జీఎస్టీ రూపంలో రూ.34,45,920లు ఆదాయం లభించనుంది. మొత్తంగా ప్రభుత్వానికి రూ.2,25,89,920లు ఆదాయం సమకూరుతుంది. దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో ప్రతి దసరా సమయంలోనూ మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దీనివల్ల మున్సిపాలిటీకి, జీఎస్టీ శాఖకు ఆదాయం లభిస్తోంది.