News April 16, 2025

నాగర్‌కర్నూల్: 23న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్

image

పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో ఈనెల 20వ తేదీలోపు CCE మార్క్స్ ఎంట్రీ పూర్తి చేయాలని జిల్లా DEO రమేశ్ కుమార్ తెలియజేశారు. ఈనెల 21న విద్యార్థుల ఆన్‌లైన్  ప్రోగ్రెస్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకుని, తరువాత వాటిని క్రాస్ చెక్ చేసి 23వ తేదీ రోజు జరిగే MEGA Parent Teacher Meetingలో తల్లిదండ్రుల సమక్షంలో ఆన్‌లైన్ ప్రోగ్రెస్ కార్డ్స్ విద్యార్థులకు అందజేయాలని సూచించారు.

Similar News

News November 11, 2025

కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

image

సీఎం చంద్రబాబు చిన్నమండెం పర్యటన నేపథ్యంలో కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్‌లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (A.S.L) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SP పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల అధికారులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

News November 11, 2025

రాష్ట్ర ఉత్సవంగా జగన్న తోట ప్రబల తీర్థం..!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో జగ్గన్న తోట ప్రభలతీర్థానికి ఎంతో పేరుంది. కనుమ రోజు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా ప్రభలు తీసుకొస్తారు. ఈ అపురూపమైన దృశ్యాలను చూడటానికి వేలాది మంది వస్తారు. దీంతో ప్రబల తీర్థాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. ఇదే విషయమై CM చంద్రబాబును టీడీపీ నాయకురాలు తేజస్వి పొడపాటి కలిసి వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే అధికారికంగా శుభవార్త వస్తాదని ఆమె చెప్పారు.

News November 11, 2025

సదరమ్ సర్టిఫికెట్ల మంజూరుకు రూ.2 కోట్ల వసూళ్లు?

image

జిల్లాలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే విభాగంలో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకల్య శాతాన్ని పెంచేందుకు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20-40 వేల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. నలుగురు ఉద్యోగులు బృందంగా ఈ అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దివ్యాంగుల నుంచి వసూళ్లకు పాల్పడటమేంటని జిల్లా వాసులు మండిపడుతున్నారు.