News April 16, 2025
ATP: దోమల నివారణే ధ్యేయంగా పనిచేయాలి: డీఎంఓ

దోమల నివారణే ధ్యేయంగా పనిచేయాలని DMO ఓబులు పేర్కొన్నారు. ఈనెల 17 నుంచి అనంతపురం జిల్లాలోని 32 మండలాలలోని 64 గ్రామాలలో ఫైలేరియా వ్యాధి రక్తపూతల సర్వే నిర్వహించాలన్నారు. జిల్లా DMHO కార్యాలయంలో సబ్ యూనిట్ మలేరియా అధికారుల సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ.. గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 18, 2026
అనంతపురం: 19న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
News January 18, 2026
అనంతపురం: 19న కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

అనంతపురం జిల్లా ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఈనెల 19న కలెక్టరేట్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్జీదారులు meekosam.ap.gov.in ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని చెప్పారు.
News January 17, 2026
అనంతపురం: భార్యను బండరాయితో మోదిన భర్త

అగ్నిసాక్షిగా మూడు ముళ్ళు వేసిన భర్త కట్టుకున్న భార్యకు కాలయముడయ్యాడు. బండరాయితో భార్య తలపై మోది హత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రాయదుర్గం మండలంలోని టి.వీరాపురంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న భార్య శివగంగమ్మను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఘటనపై కేసు నమోదు చేసి భర్త సుంకన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


