News April 17, 2025
ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్: NZB CP

ఇకపై జిల్లాలో రోజూ మైనర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నిజామాబాద్ CP సాయి చైతన్య వెల్లడించారు. ఇప్పటివరకు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే పోలీసు వారే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జరిమానాలు వేసేవారని పేర్కొన్నారు. ఇకపై మైనర్ల డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని, జైలు శిక్షతో పాటు వాహన రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News April 19, 2025
NZB: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం: కలెక్టర్

భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ రైతుల భూములకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భూ భారతిపై శనివారం వర్ని , రుద్రూర్ రైతు వేదికలలో అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్రజల కోసం ప్రత్యేకించి రైతులకు వారి భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు.
News April 19, 2025
NZB: సన్న బియ్యం లబ్ధిదారులతో మైనారిటీ కమిషన్ ఛైర్మన్ భోజనం

నిజామాబాద్ గౌతంనగర్లో సన్న బియ్యం లబ్ధిదారుడైన లింబాద్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం సన్న బియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడిని, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
నిజామాబాద్: లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ: కలెక్టర్

జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణ సాగుతోందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్, సంబంధిత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి గురించి కలెక్టర్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణ జరుగుతుందని వివరించారు.