News March 27, 2024
కొమరాడ: ఐదు కిలోల గంజాయి స్వాధీనం

ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం కూనేరు చెక్పోస్ట్ వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రాయగడ వైపు నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ బస్సులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులకు ఒక వ్యక్తి పట్టుబడినట్లు తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన కూడా మూడు కిలోల గంజాయితో ఇద్దరు మైనర్లు పట్టుబడిన విషయం తెలిసిందే.
Similar News
News July 8, 2025
జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలు: కలెక్టర్

ఉపాధి హామీ పథకం కింద విజయనగరం జిల్లాలో 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలను నాటనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్లో సోమవారం సమీక్ష నిర్వహించారు. 8 నియోజకవర్గాల్లో ఉన్న 27 మండలాల్లో సుమారుగా 477 మంది రైతులకు మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సపోటా, జామ మొదలగు 23 రకాల పండ్ల తోటలు మొక్కలు వేయుటకు సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.
News July 7, 2025
బాధితుల సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరించాలి: VZM SP

బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని SP వకుల్ జిందాల్ అన్నారు. SP కార్యాలయంలో ఆయన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 40 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు చెందినవి 13, కుటుంబ కలహాలు 4, మోసాలకు పాల్పడినవి 5, ఇతర అంశాలకు సంబంధించి 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి 7 రోజుల్లో పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
News July 7, 2025
VZM: కలెక్టరేట్కు 194 వినతులు

విజయనగరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRSకు ప్రజల నుంచి 194 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందగా పంచాయతీ శాఖకు 7, పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డిఏకు 31 వినతులు వచ్చాయి. మున్సిపాలిటీకి 5 , విద్యాశాఖకు 13, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వినతులు పెండింగ్లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.