News April 17, 2025

శ్రీకాకుళం DMHO, సీసీ సస్పెండ్

image

శ్రీకాకుళం డీఎంహెచ్ఓ టి. బాల మురళీకృష్ణ, సీసీ వాన సురేశ్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల మూడో తేదీన ఏసీబీ దాడుల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఈనెల 17 వరకు రిమాండ్ విధించారు. దీనిపై సమగ్ర నివేదిక ప్రభుత్వానికి అందించటంతో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Similar News

News December 30, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 57 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా పిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. మొత్తం 57 అర్జీలు స్వీకరించామన్నారు.

News December 29, 2025

శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి.. ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

image

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబయ్యాయి. అరసవిల్లి, శ్రీకూర్మం, నారాయణ తిరుమల ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు.

News December 29, 2025

శ్రీకాకుళం ఎస్పీ గ్రీవెన్స్‌కు 57 అర్జీలు

image

పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు పునరావృతం కాకుండా ఆయా పిర్యాదులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. వారి సమస్యలు విన్నారు. మొత్తం 57 అర్జీలు స్వీకరించామన్నారు.