News April 17, 2025
విశాఖలో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్స్

విశాఖలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగటి పూటే ఇంట్లోకి చొరబడి దొచుకుంటున్నారు. మద్దిలపాలెంలో మంగళవారం సాయంత్రం అద్దె ఇంటికోసం అని వచ్చి మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లిన ఘటన మర్చిపోకముందే MVP కాలనీలో బుధవారం సాయంత్రం మరో ఘటన జరిగింది. MVP సెక్టార్-8లో లలిత అనే వృద్ధురాలి మెడలో గొలుసు తెంపుకొని ఓ దుండగుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో MVP పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 19, 2025
సమిష్టి కృషితో విజయం సాధించాం: గంటా

కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరి సమిష్టి కృషితోనే విజయం సాధించామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీపై పూర్తి వ్యతిరేకతతోనే కూటమిలో ఆ పార్టీ కార్పొరేటర్లు చేరారని అన్నారు. జీవీఎంసీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జీవీఎంసీలో అభివృద్ధి కుంటిపడిందన్నారు.
News April 19, 2025
ఆ 27మందిపై అనర్హత వేటు వేయండి: వైసీపీ

జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్ను వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ కలిశారు. విప్ ధిక్కరించిన 27 మంది కార్పొరేటర్లపై ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ కాన్ఫిడెన్స్ ఇన్ మేయర్ రూల్స్-2008 ప్రకారం వైసీపీ గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వడం ప్రొసీడింగ్స్ ప్రకారం తప్పని.. 27మంది కార్పొరేటర్లపై అనర్హత వేటు వేయాలని కోరారు. విప్ కాపీని అందజేశారు.
News April 19, 2025
విశాఖ అభివృద్ధే సీఎం లక్ష్యం: మంత్రి డోలా

వైసీపీ 5 ఏళ్ల పాలనలో జీవీఎంసీలో జరిగిన అభివృద్ధి శూన్యమని విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వామి అన్నారు. శనివారం ఆయన జీవీఎంసీలో మేయర్పై అవిశ్వాసం నెగ్గిన సందర్భంగా కూటమి కార్పొరేటర్లతో కలిసి మాట్లాడారు. వైసీపీ అరాచకాలు అడ్డుకునేందుకే కార్పొరేటర్లు తిరుగుబాటు చేశారని పేర్కొన్నారు. విశాఖను అన్ని విధాల అభివృద్ధి చేయాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యం అన్నారు.