News March 28, 2024

నిర్మల్ : సీఎంఆర్ లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి : కలెక్టర్

image

ప్రభుత్వం సూచించిన గడువులోగా (సీఎంఆర్) కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రైస్‌మిల్లర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సీఎంఆర్ లక్ష్యాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు తదితర అంశాల పై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ 2023-24 సంవత్సరం లక్ష్యాలను గడువులోగా వెంటనే పూర్తి పూర్తిచేయాలని తెలిపారు

Similar News

News February 4, 2026

ఆదిలాబాద్: చెక్‌పోస్ట్‌లో రూ.28 లక్షల నగదు లభ్యం

image

ఆదిలాబాద్ శివారు రాంపూర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. మున్సిపల్ ఎన్నికల నిబంధనల నేపథ్యంలో మహారాష్ట్ర బస్సులో ప్రయాణిస్తున్న సుభాష్ కేశవ్ అనే వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేని 28 లక్షల రూపాయలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున రెవెన్యూ, పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు నిరంతరంగా ఈ నిఘా కొనసాగిస్తున్నారు.

News February 4, 2026

ఆదిలాబాద్: 9 సార్లు ఎన్నికలు.. ఒకరే మహిళ ఛైర్‌పర్సన్

image

ADB మున్సిపాలిటీ చరిత్రలో ఏకైక ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన రంగినేని మనీషా మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 1952లో ఏర్పాటైన పురపాలక సంఘానికి 2014లో ఆమె సారథ్యం వహించారు. గత ఎన్నికల్లో టికెట్ దక్కక దూరమైనా, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ‘ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్’ తరఫున బరిలోకి దిగుతున్నారు. 48వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న ఆమె, తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు.

News February 4, 2026

ఆదిలాబాద్ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు: ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. అక్రమ మద్యం, నగదు, బహుమతులు తరలకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐదు ఎస్‌ఎస్‌టి చెక్ పోస్టులలో 24 గంటలు వాహనాల తనిఖీ జరుగుతుందని, రూ.50 వేలకుపైగా నగదు ఉంటే సరైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, ఫనిధర్ ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.