News April 17, 2025
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలెక్టర్ కాన్ఫరెన్స్ కాల్

విజయవాడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గురువారం ఉచిత ఇసుక, తాగు నీటి సరఫరా, ఏంఎస్ఏంఈ సర్వే, స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. గురువారం నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జె. వెంకట మురళి, జిల్లా అధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు.
Similar News
News January 7, 2026
మెుక్కజొన్నలో కత్తెర పురుగు కట్టడికి సహజ కషాయం

మొక్కజొన్న పంటను ఆశించే కత్తెర పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగుల నిర్మూలనకు సహజ కషాయాన్ని రూపొందించారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు శివకృష్ణ. 200 లీటర్ల నీటిలో కిలో సర్ప్, అర కిలో పసుపును వేసి బాగా కలపాలి. అది బాగా మిక్స్ అయ్యాక ఉదయం లేదా సాయంత్రం వేళ చల్లగా ఉన్నప్పుడు వాటర్ బాటిల్కు రంద్రం చేసి మొక్కజొన్న మొక్క మొవ్వులో ఈ ద్రావణం వేయాలి. 25 రోజుల వయసున్న పైరులో మాత్రమే ఈ ద్రావణాన్ని వాడాలి.
News January 7, 2026
T20 WCకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

వచ్చే నెల భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న T20 వరల్డ్ కప్కు న్యూజిలాండ్ 15 మందితో జట్టును ప్రకటించింది. శాంట్నర్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు.
జట్టు: శాంట్నర్(C), ఫిన్ అలెన్, బ్రేస్వెల్, చాప్మన్, కాన్వే, డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిల్నే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫర్ట్, సోధి.
– మరోవైపు ఈ నెల 11 నుంచి భారత్తో న్యూజిలాండ్ 3 వన్డేలు, 5 T20ల సిరీస్లు ఆడేందుకు ఇండియా రానుంది.
News January 7, 2026
కరువు కాస్తయినా గాభరా లావు

కరువు కాలంలో మనకు దొరికేది తక్కువైనా.. ఆకలి, భవిష్యత్తు గురించి ఉండే భయం(గాభరా) మాత్రం చాలా ఎక్కువగా (లావుగా) ఉంటుంది. సాధారణంగా ఏదైనా కొరత ఏర్పడినప్పుడు, ఆ సమస్య కంటే దాని వల్ల కలిగే ఆందోళనే మనిషిని ఎక్కువగా వేధిస్తుందని ఈ మాట చెబుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు పండనప్పుడు రైతుల ఆవేదనను ఈ సామెత ప్రతిబింబిస్తుంది.


