News April 17, 2025
వనపర్తి: బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే యాసంగి వరి ధాన్యం: డీఎస్ చౌహాన్

మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన ధాన్యం క్లియర్ చేసి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చే మిల్లర్లకే యాసంగి వరి ధాన్యం కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్. చౌహాన్ స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ అప్పగింతపై గురువారం అదనపు కలెక్టర్లు రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. ఇందులో వనపర్తి జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 12, 2026
ఫ్లెమింగో ఫెస్ట్: ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచనా.!

ఫ్లెమింగో ఫెస్టివల్లో రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. హీరోయిన్లు ఆషికా, డింపుల్ అందాలు, హెబ్బా డాన్స్ ఫర్మామెన్స్ అదిరిపోయింది. సింగర్ హారిక పాటలకు ప్రేక్షకులు తెగ సందడి చేశారు. జదర్దస్త్ కమెడీయన్లు రాకేష్ దంపతులు, చంటి అలరించారు. మొత్తంగా రెండో రోజు కార్యక్రమాలు ‘ఈమాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచనా’ అన్నట్లు సాగాయి. మీరూ ఈవెంట్కు వెళ్లింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.
News January 12, 2026
దేశానికి మోదీనే రక్షణ గోడ: ముకేశ్ అంబానీ

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నా PM మోదీ వల్ల ఇండియా సురక్షితంగా ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఈ సవాళ్లు భారత ప్రజలను ఇబ్బందిపెట్టలేవని, ఎందుకంటే నరేంద్ర మోదీ అనే అజేయ రక్షణ గోడ ఉందని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు చూస్తున్న ఆశ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో గుజరాత్లో ₹7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.
News January 12, 2026
కడప: పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. 11మంది MROలకు నోటీసులు

రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొరడా ఝులిపించారు. ఈనెల 2 నుంచి 9వరకు రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించినా అలసత్వం వహించిన తొండూరు MROను కలెక్టర్ సస్పెండ్ చేశారు. చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CKదిన్నే MROలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.


