News April 17, 2025
ఒంగోలు: త్వరలో ఈ చెక్ ఇతివృత్తంతో కార్యక్రమం

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో ఈ – చెక్ ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేక ఇతివృత్తంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న చేపట్టే కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
Similar News
News December 31, 2025
మార్కాపురం జిల్లాకు సిబ్బంది కేటాయింపు

మార్కాపురం నూతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందిని నియమిస్తూ ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ రాజబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సూపరింటెండెంట్ అడ్మిన్ సెక్షన్ – 2, సూపరింటెండెంట్ మెజిస్ట్రేరియల్ సెక్షన్1, సూపరింటెండెంట్ కోఆర్డినేషన్ సెక్షన్ 2, సూపరింటెండెంట్ ల్యాండ్స్ 1 సెక్షన్-2, ల్యాండ్స్ 2 సెక్షన్ 1, పీజీఆర్ఎస్ 4, డ్రైవర్స్ 3, ఆఫీస్ సబార్డినేట్స్- 5 మందిని కేటాయించారు.
News December 31, 2025
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ఇదే!

మార్కాపురంను నూతన జిల్లాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే మార్కాపురం పట్టణంలోని తర్లపాడు రోడ్డులో గల హాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ కాలనీలో ఉన్న భవనాన్ని కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యాలయం నుంచి పరిపాలన వ్యవహారాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భవనానికి నూతన హంగులనిచ్చారు.
News December 31, 2025
మార్కాపురం కలెక్టర్, SP ఎవరంటే..?

నేటి నుంచి మార్కాపురం జిల్లాగా అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో నూతన జిల్లాకు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం కలెక్టర్ రాజాబాబును మార్కాపురం ఇన్ఛార్జ్ కలెక్టర్గా, జేసీ గోపాలకృష్ణను ఇన్ఛార్జ్ జేసీగా, ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఇన్ఛార్జ్ ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. సరికొత్త జిల్లాకు తొలి కలెక్టర్, జేసీ, ఎస్పీలుగా వీరు బాధ్యతలు స్వీకరిస్తారు.


