News April 18, 2025
ASF జిల్లాలో 8 మందిపై కేసు: వాంకిడి SI

మహారాష్ట్ర నుంచి రాజురాంపల్లికు పశువులను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై ప్రశాంత్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు వాంకిడి మండలం అకిని సమీపంలో బుధవారం తనిఖీలు నిర్వహించగా అనుమతులు లేకుండా 4 బులెరో వాహనాల్లో 8 పశువులను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. పశువులను కాగజ్నగర్ గోశాలకు తరలించామన్నారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రశాంత్ పేర్కొన్నారు.
Similar News
News December 27, 2025
ఏర్పేడు: ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. Ph.D ఇన్ ఫిజిక్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/Project_Positions వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 03.
News December 27, 2025
జనరేషన్ బీటా గురించి తెలుసా?

2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 వరకు పుట్టే పిల్లలందరినీ ‘జనరేషన్ బీటా’గా పిలుస్తారు. ఈ తరం పూర్తిగా AI ప్రపంచంలో పెరగనుంది. భారత్లో మొదటి బీటా బేబీ మిజోరంలో పుట్టింది. ఇలా జనరేషన్స్కు పేర్లు పెట్టడం 1901లో ప్రారంభమైంది. జనరేషన్ బీటాకు ముందు జనరేషన్ X (1965-80), జనరేషన్ Y లేదా మిలీనియల్స్(1981-1996), జనరేషన్ Z (1997-2009), జనరేషన్ ఆల్ఫా (2010-2024)లు ఉన్నాయి. ఇంతకీ మీరు ఏ జనరేషన్?
News December 27, 2025
కృష్ణా: మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.!

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.


