News April 18, 2025
బంగారు బాల్యం జిల్లా మోడల్ అధికారిగా రాచర్ల ఎంఈవో

ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బంగారు బాల్యం ప్రాజెక్టుకు జిల్లా నోడల్ అధికారిగా రాచర్ల ఎంఈవో గిరిధర్ శర్మను జిల్లా కలెక్టర్ అన్సారియా నియమించారు. జిల్లా స్థాయి వివిధ డిపార్ట్మెంట్ అధికారుల సమన్వయంతో బడి ఈడు గల బాలలకు సంబంధించిన అంశాల పైన జిల్లా వ్యాప్తంగా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. వీరి నియామకం పట్ల పలువురు మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Similar News
News January 21, 2026
ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.
News January 20, 2026
ఒంగోలు SP కీలక ఆదేశాలు

మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్ఠంగా పని చేయాలని ప్రకాశం ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు, ఈవ్ టీజింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఏ సమస్య ఎదురైనా త్వరగా వెళ్లాలని ఆదేశించారు.
News January 20, 2026
ప్రకాశం జిల్లా కలెక్టర్కు అవార్డు

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల మ్యాపింగ్లో సాధించిన పురోగతికి బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు ఆయనను ఎంపిక చేశారు. 2002 ఎస్ఐఆర్ డేటాతో 2026 ఎస్ఐఆర్ డేటాను సరిపోలడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25న విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకోనున్నారు.


