News April 18, 2025
BRS నేతలతో కేసీఆర్ సమావేశం

TG: బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సమావేశమయ్యారు. ఎమ్మెల్సీలు కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి కేసీఆర్ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దాంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అనుసరించాల్సిన తీరు, వ్యూహాలపై ఆయన మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News April 20, 2025
బంటుమిల్లి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

బంటుమిల్లి మండలం నారాయణపురం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మచిలీపట్నంకు చెందిన వాసాబత్తిన వీరాచారి (29) ,అనకాపల్లి ప్రసాద్ (28) రాజమండ్రి నుంచి బైక్ పై మచిలీపట్నం వస్తుండగా కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ఇరువురు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
News April 20, 2025
SSMB29: రెండు నెలలపాటు భారీ యాక్షన్ సీక్వెన్స్?

మహేశ్బాబు-రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న SSMB29 మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది. 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించేందుకు డైరెక్టర్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లో పెద్ద సెట్ను సిద్ధం చేస్తున్నట్లు టాక్. 2 నెలల పాటు షూట్ జరుగుతుందని, మహేశ్, పృథ్వీరాజ్, ప్రియాంక పాల్గొంటారని సమాచారం.
News April 20, 2025
మగవాళ్లకూ ‘హీ’ టీమ్స్ ఉండాలి: పురుషులు

మహిళలకు ‘షిీ’ టీమ్స్లాగే పురుషులకు కూడా ‘హీ’ టీమ్స్ ఉండాలని భార్యాబాధితులు డిమాండ్ చేశారు. భార్యల చిత్రహింసల నుంచి తమను కాపాడాలంటూ దేశంలోని వివిధ రాష్ట్రాల భార్యాబాధితులు ఢిల్లీలోని ధర్నా చౌక్లో ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఏపీ, తెలంగాణ నుంచి ఎక్కువమంది బాధితులు పాల్గొన్నారు. వీరంతా ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ పేరుతో ఆందోళన చేపట్టారు. తెలుగు బిగ్బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా కూడా ఇందులో పాల్గొనడం విశేషం.