News April 19, 2025

ఇకపై భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం: మంత్రి

image

ఎన్నికల వేల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం లభించనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ భారతి చట్టంపై భోరజ్ మండలం పూసాయిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించారు.

Similar News

News September 11, 2025

ADB: గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

శిశు మరణాలను తగ్గించాలంటే గర్భిణులకు సరైన పర్యవేక్షణ, ప్రసవ సమయంలో నాణ్యమైన వైద్య సేవలు అందించడం అవసరమని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. జిల్లాలో శిశు మరణాల రేటును ఒక అంకెకు తగ్గించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 15గా ఉన్న శిశు మరణాల రేటును 10 కన్నా తక్కువకు తీసుకురావడానికి వ్యూహాలను రూపొందించాలని పేర్కొన్నారు.

News September 10, 2025

ఆదిలాబాద్ : ఇంగ్లీష్ అధ్యాపక పోస్టుకై డెమోకు ఆహ్వానం

image

ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో ఖాళీగా ఉన్న ఇంగ్లీష్ అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు నేరుగా డెమోకు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం తెలిపారు. అభ్యర్థులు పీజీ సంబంధిత సబ్జెక్టులలో కనీసం 55% మార్కులు కలిగి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువపత్రాలతో సెప్టెంబర్ 12న కళాశాలలో జరిగే డెమోకు నేరుగా హాజరు కావాలన్నారు.

News September 10, 2025

ఆదిలాబాద్: INTERలో చేరేందుకు మరో అవకాశం

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేందుకు మరొకసారి ఇంటర్ బోర్డు అవకాశం కల్పించిందని ఆదిలాబాద్ డీఐఈఓ జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో చేరాలనుకుంటే ఈనెల 11, 12 తేదీల్లో అడ్మిషన్ పొందాలని సూచించారు. అలాగే లాంగ్వేజ్ మార్పు చేసుకునేందుకు కూడా ఈ రెండు రోజులే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.