News March 28, 2024
నిడమర్రు: వాహన తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదు సీజ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో బుధవారం పలు చోట్ల నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.3.5 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఉంగుటూరు మండలం బువ్వనపల్లి చెక్పోస్టు వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ1.75 లక్షలు నగదు సీజ్ చేసినట్లు నిడమర్రు ఎస్సై ఆర్.శ్రీను చెప్పారు. బువ్వనపల్లి సత్యనారాయణపురంలో ఎటువంటి పత్రాలు లేకుండా కారులో రూ.1.75 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News September 8, 2025
ఇరిగేషన్ ట్యాంకులు పునర్ నిర్మాణానికి ప్రతిపాదనలు: కలెక్టర్

జిల్లాలోని మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల పునర్నిర్మాణానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో డ్వామా, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిగూడెం మెట్ట ప్రాంతంలో గుర్తించిన 54 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను పునర్నిర్మించి భూగర్భ జలాలను పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు.
News September 8, 2025
భీమవరం కలెక్టరేట్లో 192 అర్జీలు

భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి 192 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో లేని అర్జీలను సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందికి సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News September 8, 2025
రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు. అలాగే 1100 నంబర్కు కాల్ చేసి కూడా తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ అన్నారు.