News April 19, 2025

మలేషియా నుంచి విశాఖ రాని కూటమి మద్దత్తు కార్పొరేటర్

image

కూటమి కార్పొరేటర్లు విహార యాత్ర నుంచి శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. వీరిలో 73వ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత వారితో కలిసి రాలేదు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తనను మాత్రమే పార్టీలో ఆహ్వానించారని, తన భర్తను ఆహ్వానించలేదని అలిగి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పల్లా ఆమెతో ఫోన్‌లో మాట్లాడి బుజ్జగించి శనివారం విశాఖ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుజాత వైసీపీలో గెలిచి కూటమిలో చేరారు.

Similar News

News September 12, 2025

KGH అభివృద్ధిపై విభాగాధిపతులతో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సమీక్ష

image

KGH అభివృద్ధిపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అన్ని విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది అవసరాలు, వసతులపై చర్చించారు. ఆంకాలజీకి 30 మంది స్టాఫ్ నర్సులు, గ్యాస్ట్రో విభాగానికి పరికరాలు, ఎండోక్రనాలజీకి మరమ్మతులు ప్రతిపాదించారు. వార్డుల వారీగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.

News September 12, 2025

రేపు విశాఖ రానున్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా

image

కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం విశాఖ రానున్నారు. శనివారం రాత్రి 8:50కు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రికి నోవాటల్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం రైల్వే గ్రౌండ్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం పలువురు స్థానిక నేతలతో సమావేశం అవుతారు. ఆదివారం సాయంత్రం 4:45కి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్తారు.

News September 12, 2025

విశాఖ రానున్న మంత్రి సత్యకుమార్ యాదవ్

image

రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ శనివారం విశాఖ రానున్నారు. శనివారం ఉదయం 8గంటలకు ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం రాత్రికి విశాఖలో బస చేస్తారు. ఆదివారం ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 2గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ వెళ్తారు. దీనికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.