News April 19, 2025

కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

image

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్‌ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Similar News

News September 11, 2025

అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు: ఏఎస్‌పీ మౌనిక

image

ఏప్రిల్‌లో దేవరకొండలోని హనుమాన్ నగర్‌లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పిట్ట గంగాధరను అరెస్టు చేసినట్లు ఏఎస్‌పీ మౌనిక తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ దొంగతనంలో రూ. 6 లక్షల నగదు, 2.2 తులాల బంగారం చోరీకి గురయ్యాయని.. నిందితుడిపై సుమారు 100కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్లు ఏఎస్‌పీ తెలిపారు.

News September 11, 2025

NLG: మద్యం టెండర్లకు కసరత్తు

image

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్‌లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

News September 11, 2025

NLG: మద్యం టెండర్లకు కసరత్తు

image

జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల గడువు ముగియనున్న నేపథ్యంలో, ఆబ్కారీ శాఖ కొత్త టెండర్ల నిర్వహణకు సిద్ధమవుతోంది. 2025-27 సంవత్సరాలకు సంబంధించి, అక్టోబర్‌లోనే టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిసింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మొత్తం 155 మద్యం దుకాణాలకు టెండర్లు వేగవంతం చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.