News March 28, 2024
అనంత: నేడు చంద్రబాబు పర్యటన వివరాలు

అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 9.55 మదనపల్లి నుంచి హెలికాప్టర్లో 10.40 ప్రసన్నాయ పల్లి చేరుకుంటారు. అక్కడ నుంచి 11 నుంచి12.30 వరకు రాప్తాడు బహిరంగసభలో పాల్గొంటారు. 2 గంటల వరకు ఆర్డీటీ స్టేడియంలో భోజన విరామం. 2.30 నుంచి 4 వరకు బుక్కరాయసముద్రం మీటింగ్లో పాల్గొంటారు. అక్కడనుంచి కదిరికి 5.10 చేరుకుని కార్యక్రమాల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 19, 2026
అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాల్లో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
News March 19, 2026
అనంత: రూ.1.30 కోట్లకు పైగా పంట నష్టం

అనంతపురం జిల్లాలో ఈదురుగాలుల తాకిడికి ఉద్యాన, వ్యవసాయ పంటలు చెల్లాచెదురైన పరిస్థితి నెలకొంది. కళ్యాణదుర్గం, కంబదూరు, శెట్టూరు, ఆత్మకూరు, గార్లదిన్నె, శింగనమల తదితర మండలాలలో 65 ఎకరాలలో అరటి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రూ.1.30 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు. వరి, మొక్కజొన్నతో పాటు ఇతర ఉద్యాన పంటల నష్టం వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
News March 19, 2026
ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం: కలెక్టర్

నూతన సంవత్సరాది ఉగాది పండుగను తెలుగు సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని అనంతపురం కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ గురువారం ఉగాది పండుగను జిల్లా సంస్కృతి సంప్రదాయ పద్ధతిలో సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా ప్రజలకు పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.


