News April 19, 2025

గుంటూరు: జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో భాష్యం విద్యార్థుల జోరు

image

జేఈఈ మెయిన్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. ఏపీ నుంచి జి.సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించి ఫిమేల్ కేటగిరీలో దేశస్థాయిలో టాపర్‌గా నిలిచింది. ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంకుతో మెరిసింది. మొత్తం 100లోపు 16 మంది, 200లోపు 28, 500లోపు 60, 1000లోపు 82 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారని శనివారం గుంటూరులో భాష్యం ఛైర్మన్ రామకృష్ణ తెలిపారు. 73.24% సక్సెస్‌ రేటు సాధించామన్నారు.

Similar News

News July 7, 2025

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోండి: DEO

image

జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2025 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సి.వి రేణుక తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని మండల, ఉప విద్యాశాఖ అధికారి ద్వారా ఈనెల 13వ తేదీలోగా http//nation-alawardstoteachers.education.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 7, 2025

ANMల బదిలీలలో చిక్కుముడులు.. మరోసారి కౌన్సెలింగ్

image

గుంటూరు జిల్లా వైద్య శాఖ ఇటీవల ANM గ్రేడ్-3గా ఉన్న సుమారు 200 మందికి పదోన్నతులు మంజూరు చేసి కొత్త నియామకాలు ఇచ్చింది. కానీ గత కౌన్సెలింగ్‌లో అదే పోస్టులు ఖాళీలుగా చూపటంతో పలువురు ఎంపిక చేసుకున్నారు. ఈ అంశం అధికారులు గుర్తించడంతో గత కౌన్సెలింగ్‌ను రద్దు చేసి సోమవారం మళ్లీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్యాధికారి విజయలక్ష్మీ తెలిపారు. ఈసారి ప్రక్రియ సునిశ్చితంగా, సీనియారిటీ ప్రాతిపదికన సాగనుంది.

News July 7, 2025

వికేంద్రీకరణ పద్ధతిలో PGRS అమలు: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS) సోమవారం నుంచి మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా అమలు కానుందని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులు సమీప మండల, డివిజనల్, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ఇలా నిర్వహించడం వల్ల పాలన ప్రజలకు చేరువ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని ఫిర్యాది దారులు ఉపయోగించుకోవాలన్నారు.