News March 28, 2024
చిత్తూరు: హైవేపై రోడ్డు ప్రమాదం

తవణంపల్లి మండలం, K పట్నం 140 జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనక నుంచి కారు ఢీకొనడంతో కారులో ఉన్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వేగం కంట్రోల్ కాక లారీని కారు ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. గాయపడిన వ్యక్తి బెంగళూరుకు చెందిన మహేశ్గా గుర్తించి వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Similar News
News March 13, 2026
చిత్తూరు: ముగ్గరికి రెండేళ్ల జైలు శిక్ష

ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 2014 నవంబర్లో రొంపిచర్ల పోలీసు స్టేషన్ పరిధిలో శేషాచలం అటవీ ప్రాంతం నుంచి 10 ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా చేస్తూ ముగ్గురు నిందితులు పట్టుపడ్డారు. నిందితులు తేజ ప్రకాష్ రెడ్డి, గురునాథ్, శివకుమార్కు కోర్టు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించినట్లు వెల్లడించారు.
News March 13, 2026
చిత్తూరు జిల్లాకు రూ.115 కోట్ల మంజూరు

చిత్తూరు జిల్లాలో 2.05 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవకు సంబంధించి రూ.115 కోట్లు జమ కానున్నాయి. చిత్తూరులో 11,321 మంది రైతులకు రూ.6.32 కోట్లు, పూతలపట్టులో33,881- రూ.19.27 కోట్లు, పలమనేరు-38,368- రూ.21.71 కోట్లు, కుప్పం- 36,673- రూ.19.80 కోట్లు, పుంగనూరు- 37,191- రూ. 21.23 కోట్లు, నగరి- 12,472- రూ.7.06 కోట్లు, జీడీ నెల్లూరులో 36,047 మందికి రూ.20.43 కోట్లు మంజూరయ్యాయి.
News March 13, 2026
చిత్తూరు: పది పరీక్షలు.. 1210మంది ఇన్విజిలేటర్లు

టెన్త్ పబ్లిక్ పరీక్షలకు తొలి విడతగా 1210 మంది టీచర్లకు ఇన్విజిలేషన్ డ్యూటీలు వేసినట్లు చిత్తూరు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. వీరంతా ఈనెల 16, 18, 21, 31, మే ఒకటో తేది పనిచేయాల్సి ఉందన్నారు. వీరికి 10KM పరిధిలోనే ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశామని చెప్పారు. ఎమర్జెన్సీ, గర్భిణులు, నిబంధనల ప్రకారం తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ విధులు నిర్వహించ లేనివారు తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.


