News April 19, 2025

కర్నూలులో క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం 

image

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం నూతన క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, మంత్రి టీజీ భరత్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. అనంతరం నూతన ఆస్పత్రి భవనాన్ని సందర్శించి అక్కడ ఉండే వసతుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆమె సూచించారు.

Similar News

News January 13, 2026

రూపాయి క్షీణత.. హెచ్చుతగ్గుల్లో భాగమే: RBI గవర్నర్

image

ఇటీవల రూపాయి <<18834841>>విలువ<<>> పడిపోతుండటం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే రూపీ వాల్యూ రూ.90ని దాటింది. అయితే ఇది సాధారణ హెచ్చుతగ్గుల్లో భాగమేనని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. ‘రూపాయి, మారకపు రేట్లపై RBI విధానం ఏళ్లుగా స్థిరంగా ఉంది. మార్కెట్లు బలంగా ఉన్నాయని మేం నమ్ముతున్నాం. ధరలను అవే నిర్ణయిస్తాయి’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భారత ఎకానమీ మూలాలు బలంగా ఉన్నాయని తెలిపారు.

News January 13, 2026

మరో 4 సహకార బ్యాంకులు : CEO శ్రీనివాసరావు

image

కేంద్ర కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో మరో 4 సహకార బ్యాంకులు అందుబాటులోకి రానున్నాయని సొసైటీ CEO శ్రీనివాసరావు Way2Newsతో తెలిపారు. ఇప్పటికే 23 ఉండగా నూతనంగా 4 బ్యాంకులను ఇందుకూరుపేట, నెల్లూరు(R)లో కాకుపల్లి, కొత్తూరు, డక్కిలి ప్రాంతాల్లో ఏర్పాటు చేసి రైతులకు సేవలు అందిస్తామని వెల్లడించారు. తమ బ్యాంకు పరిధిలో ఈ ఏడాది రూ.2900 కోట్ల వ్యాపార లక్ష్యానికి రూ.2250 కోట్లకు చేరువయ్యామని తెలిపారు.

News January 13, 2026

మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టింగ్‌లు

image

మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్‌గా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజానర్సింహా, ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతులు మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.