News March 28, 2024
4 చిలుకలకు బస్ ఛార్జీ రూ.444

కర్ణాటక ఆర్టీసీ బస్సులో చిలుకలకు టికెట్ కొట్టిన వార్త వైరల్ అవుతోంది. ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది. 4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి ఫ్రీ టికెట్ ఇచ్చిన కండక్టర్.. చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు. నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
Similar News
News March 8, 2026
వారంలో సుప్రీంలీడర్ ఎంపిక: ఇరాన్ ప్రతినిధి

వారంలో సుప్రీంలీడర్ ఎంపిక జరుగుతుందని ఇండియాలో ఇరాన్ ప్రతినిధి అబ్దుల్ మాజిద్ తెలిపారు. ‘సుప్రీంలీడర్ను 88 మంది నిపుణుల బృందం నామినేట్ చేస్తుంది. US, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఆ బృందం భేటీ జరగలేదు. అందుకే ఆలస్యం. ఒకవేళ కొత్త లీడర్ను US చంపితే, ఇంకొకరిని ఎంచుకుంటాం. మీరు 9 కోట్ల మందినీ చంపలేరు. అమెరికాకు లొంగే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. రెండేళ్లు యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
News March 8, 2026
నేపాల్కు కాబోయే ప్రధాని.. చదివింది కర్ణాటకలోనే

నేపాల్లో Gen Z ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన RSP నేత బాలెన్ షా ఆ దేశ PM పీఠానికి చేరువయ్యారు. ఆయన ఉన్నత విద్య చదివింది ఇండియాలోనే కావడం విశేషం. బెంగళూరులోని విశ్వేశ్వరయ్య టెక్నికల్ వర్సిటీలో 2016-18 వరకు స్ట్రక్చరల్ ఇంజినీరింగ్లో ఎంటెక్ పూర్తిచేశారు. కాగా తాజా ఎన్నికల్లో 165 స్థానాలకు గాను RSP 104 చోట్ల గెలిచింది. 21 చోట్ల లీడింగ్లో ఉంది. బ్యాలెట్ పేపర్ కావడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
News March 8, 2026
వెంకీ-త్రివిక్రమ్ మూవీ.. క్రేజీ న్యూస్!

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం-AK47’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ హాఫ్లో ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ తరహా కామెడీ ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మూవీని సీరియస్ మోడ్లోకి తీసుకెళ్తుందని సమాచారం. సెకండాఫ్లో ‘AK47’ ట్యాగ్లైన్కు తగ్గట్టు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అక్టోబర్ 2న చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


